Friday, April 26, 2024
Friday, April 26, 2024

విజయవాడలో దారుణం..మహిళను ఇంట్లో బంధించి.. గ్యాంగ్‌ రేప్‌

విజయవాడ పరిధిలోని పెనమలూరులో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు ఓ మహిళను గదిలో బంధించి మూడు రోజులపాటు అఘాయిత్యానికి ఒడిగట్టారు. గత రాత్రి ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని బెంజి సర్కిల్‌ వద్ద కూలిపనులు చేసుకునే ఓ మహిళను అదే ప్రాంతంలోని సులభ్‌ కాంప్లెక్స్‌లో పనిచేసే ఓ వ్యక్తి ఈ నెల 17న కానూరు సనత్‌నగర్‌లోని ఓ గదికి తీసుకెళ్లాడు. అక్కడ అతడి పాటు మరో ముగ్గురు ఆమెపై మూడు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డారు.మహిళకు మద్యం తాగించి కిరాతకులు సిగరెట్లతో కాల్చారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు సోమవారం ఆసుపత్రిలో చేరడంతో విషయం వెలుగు చూసింది. పెనమలూరు పోలీసులకు ఆసుపత్రి సమాచారం ఇవ్వడంతో వారొచ్చి బాధితురాలితో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img