Friday, April 26, 2024
Friday, April 26, 2024

వివేక హత్యలో జగన్‌ పాత్ర


చంద్రబాబు విమర్శ
విశాఖ మహానగరానికి పూర్వవైభవం రావాలంటే సైకోపాలన పోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. పెందుర్తి కూడలిలో బుధవారం రాత్రి జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ వివేక హత్యకేసులో జగన్‌ పాత్ర ఉందని విమర్శించారు.

విశాలాంధ్ర-పెందుర్తి: విశాఖ మహానగరానికి పూర్వవైభవం రావాలంటే సైకోపాలన పోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. పెందుర్తి కూడలిలో బుధవారం రాత్రి జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డితో పాటు వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగారు. పాలన చేతకాని జగన్‌ అన్ని వ్యవస్థలను నాశనం చేసి కోలుకోలేని దెబ్బతీశారని మండిపడ్డారు. తన బాబాయి వివేకానందరెడ్డి హత్యలో సీఎం జగన్‌ పాత్ర ఉందని ఆరోపించారు. మన రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రాలు నవ్వుతుంటే బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ భూములపై కన్నేసిన జగన్‌…అమరావతి రాజధానిని ధ్వంసం చేశారని మండిపడ్డారు. అంతకుముందు మాట్లాడిన టీడీపీ నాయకులు వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖ నుండి వచ్చిన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చినము సిడివాడ నుండి పెందుర్తి కూడలి వరకు పాదయాత్రగా వచ్చిన చంద్రబాబును వేలాదిమంది కార్యకర్తలు అనుసరించారు. చంద్రబాబు చేరుకునేసరికి పెందుర్తి రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img