Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలి

ఏపీ హైకోర్టు కీలక తీర్పు.. జగన్‌ సర్కార్‌కు షాక్‌
ఏపీ మూడు రాజధానులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దు పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టంచేసింది. .భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోర్టు తెలిపింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తిచేయాలని ఆదేశించింది. అంతేకాదు.. 3 నెలల్లోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని ధర్మాసనం డెడ్‌ లైన్‌ కూడా విధించింది. రైతులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని జగన్‌ సర్కార్‌కు కోర్టు సూచించింది. మరోవైపు అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా అభివృద్ధి చేయాల్సిందేనని కోర్టు సూచించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఆ భూములు తనఖా పెట్టడానికి వీల్లేదు
రాజధాని అవసరాలకు తప్ప ఇతరాత్రా వాటికి ఆ భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదు.అమరావతి నుంచి ఏ కార్యాలయాన్ని తరలించకూడదని ధర్మాసనం పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img