ఈనెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని, ఆఫ్లైన్లోనే పాఠశాలలను నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. సాధారణ పనివేళల్లోనే పాఠశాలలు నడిపిస్తామన్నారు. ఇప్పటివరకు 95శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని, మిగిలిన వారికి కూడా త్వరితగతిన టీకాలు వేయాలని ఆదేశించామని తెలిపారు.