వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ
గుజరాత్ రాష్ట్రంలోని అడవిలో 3వేల కృష్ణ జింకలు రోడ్డు దాటుతున్న అద్భుతమైన వీడియోను ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా ట్వీట్ చేశారు. ‘అద్భుతం’అనే క్యాప్షన్ తో మోదీ షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే, భావ్నగర్లోని కృష్ణజింకల జాతీయ పార్కులో మూడువేల కృష్ణ జింకలు ఒకదాని వెనుక ఒకటి రోడ్డు దాటుతుండగా కొందరు వీడియో తీశారు. ఈ వీడియోను గుజరాత్ సమాచార శాఖ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఆ ట్వీట్నే ప్రధాని మోదీ రీ ట్వీట్ చేశారు. ఈ వీడియోను మోదీ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. లక్షలాది వ్యూస్ వస్తున్నాయి. వేలాది మంది రీట్వీట్లు చేస్తున్నారు. కృష్ణ జింకలను ఇంతటి భారీ సంఖ్యలో తొలిసారి చూస్తున్నారమని కామెంట్లు చేస్తున్నారు.