Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

3వేల కృష్ణజింకలు చెంగుచెంగున ఒకేచోట


వీడియో షేర్‌ చేసిన ప్రధాని మోదీ
గుజరాత్‌ రాష్ట్రంలోని అడవిలో 3వేల కృష్ణ జింకలు రోడ్డు దాటుతున్న అద్భుతమైన వీడియోను ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా ట్వీట్‌ చేశారు. ‘అద్భుతం’అనే క్యాప్షన్‌ తో మోదీ షేర్‌ చేసిన ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సోషల్‌ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే, భావ్‌నగర్‌లోని కృష్ణజింకల జాతీయ పార్కులో మూడువేల కృష్ణ జింకలు ఒకదాని వెనుక ఒకటి రోడ్డు దాటుతుండగా కొందరు వీడియో తీశారు. ఈ వీడియోను గుజరాత్‌ సమాచార శాఖ తమ ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఆ ట్వీట్‌నే ప్రధాని మోదీ రీ ట్వీట్‌ చేశారు. ఈ వీడియోను మోదీ షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్‌ అయింది. లక్షలాది వ్యూస్‌ వస్తున్నాయి. వేలాది మంది రీట్వీట్లు చేస్తున్నారు. కృష్ణ జింకలను ఇంతటి భారీ సంఖ్యలో తొలిసారి చూస్తున్నారమని కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img