Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

40 వేలకు తగ్గిన క్రియాశీల కేసులు…

దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వస్తోంది. తాజాగా 3,615 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,45,79,088కి చేరాయి. ఇందులో 4,40,09,525మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకోగా 5,28,584 మంది మరణించారు. మరో పక్క యాక్టివ్‌ కేసులు క్రమంగా దిగొస్తున్నాయి. 40,979 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 14 మంది మృతిచెందగా, 4,972 మంది కరోనా నుంచి బయటపడ్డారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.12 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. రికవరీ రేటు 98.72 శాతంగా ఉందని, యాక్టివ్‌ కేసులు 0.10 శాతంగా ఉందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img