Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఎక్కడా పాఠశాలలను మూసివేయలేదు.. అలా ఎక్కడైనా జరిగితే నాది బాధ్యత

: మంత్రి బొత్స సత్యనారాయణ
ఏపీలో ఎక్కడా పాఠశాలలను మూసివేయలేదని, అలా ఎక్కడైనా జరిగితే రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా బాధ్యత వహించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.3, 4, 5 తరగతుల విలీనం తర్వాత ఫౌండేషన్‌ స్కూల్స్‌ తీసుకొస్తామని వెల్లడిరచారు. విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొనే జీవో 117కు సవరణ చేసినట్లు చెప్పారు. అలాగే విద్యార్థుల సంఖ్య 21 దాటితే ఎస్జీటీ ఉపాధ్యాయుడిని నియమిస్తామని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 దాటితే ప్రధాన ఉపాధ్యాయుడి నియామకం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నదులు, వాగులు, రహదారుల సమస్యలున్న పాఠశాలలపై సమీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. విదేశీ విద్యకు జగనన్న పేరులో తప్పేంముందని.. అయినా మరోసారి పరిశీలిస్తామని బొత్స స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img