సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు దిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. డిసెంబర్ ఆరో తేదీన ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ చద్దా ప్యానెల్ ముందు హాజరుకావాలంటూ ఆదేశించారు. సోషల్ మీడియా సిక్కులపై అనుచిత రీతిలో వ్యాఖ్యలు చేసిన కంగనాపై ముంబైలోనూ కేసును నమోదు చేశారు. ఏడాది కాలంగా రైతులు చేస్తున్న ధర్నాలు ఖలిస్తానీ ఉద్యమంగా అభివర్ణిస్తూ ఆమె ఆరోపణలు చేసింది. ఆమె కావాలనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్న ఢల్లీి, హర్యానా, పంజాబ్ రైతుల తీరును కంగనా తప్పుపట్టారు.