జనవరి 31న పార్లమెంట్లో కేంద్రబడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా బడ్జెట్ సమావేశాల మధ్యలో తాత్కాలిక విరామం తర్వాత ఏప్రిల్ 6వ తేదీన ముగియనున్నాయి. 66 రోజుల కాలంలో 27 సిట్టింగ్లు ఉంటాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ రోజు వెల్లడిరచారు. గతేడాది ఆగస్టులో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము తొలిసారి పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజున పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగం చేస్తారు. ఈ అమృత కాలంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, కేంద్ర బడ్జెట్, ఇతర అంశాలపై చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ రోజు ట్వీట్ చేశారు.