Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

దేశంలో కొత్తగా 14,306 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి తగ్గుతోంది. కొత్త కేసులు 14వేలకు పడిపోయాయి. క్రియాశీల రేటు గణనీయంగా తగ్గుతుండగా, రికవరీ రేటు ఊరటనిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను విడుదల చేసింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 14,306 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,89,774కు చేరింది.ఇందులో 3,35,67,367 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,67,695 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా బారినపడి మరో 4,54,712 మంది మహమ్మారి వల్ల మరణించారు. కాగా, గడిచిన 24 గంటల్లో 443 మంది మరణించగా, 18,762 మంది కరోనా నుంచి బయటపడ్డారు. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 8,538 కేసులు ఉన్నాయని, 71 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img