Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దేశంలో కొత్తగా 1,946 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 1,946 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,46,34,376కు చేరింది. ఇందులో 4,40,79,485 మంది బాధితులు కరోనా కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,923 మంది కోలుకున్నారు. మరో 25,968 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనాకు నలుగురు బలవగా, 2417 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. ఇక మొత్తం కేసుల్లో 0.06 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని, రోజువారీ పాజిటివిటీ 0.75 శాతానికి పడిపోయిందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.41 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img