దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచిన తాజా బులిటెట్ ప్రకారం.. దేశంలో కొత్తగా 2,451 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 14,241 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,30,52,425కి చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు మొత్తం 5,22,116 మంది మరణించారు. దేశంలో రికవరీ రేటు 98.76గా ఉంది.దేశవ్యాప్తంగా 1,87,26,26,515 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, నిన్న ఒక్కరోజే 18,03,558 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది.