మంత్రులకు ప్రధాని దిశానిర్ధేశం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి ఇవాళ భేటీ అయ్యింది. ప్రధాని మోదీ అధికార నివాసంలో ఈ సమావేశం జరిగింది. జూలై 7న మంత్రి వర్గ పునర్వవస్థీకరణ తర్వాత మంత్రులంతా సమావేశం కావడం ఇదే మొదటిసారి. త్వరలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగనున్న తరుణంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అందరూ హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మంత్రులకు దిశానిర్ధేశం చేశారు. ముఖ్యంగా కొవిడ్పై పోరాటంలో ఎలాంటి అలసత్వం వద్దన్నారు. కొవిడ్ ప్రోటోకాల్ను ప్రజలు పాటించకపోవడం మంచిది కాదని, ప్రజలు మాస్కులు లేకుండా సామాజిక దూరం పాటించకుండా రద్దీ ప్రాంతాల్లో తిరుగాడటం ఆందోళ కలిగిస్తుందని చెప్పారు. కాగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 19న ప్రారంభమై ఆగస్టు 13తో ముగుస్తాయి.