Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

విశాలాంధ్ర 70 వ వార్షికోత్సవ సంబరాలు

వినుకొండ రూరల్ : ప్రముఖ దినపత్రిక విశాలాంధ్ర 70 వ వార్షికోత్సవ సంబరాల సందర్భంగా పల్నాడు జిల్లా వినుకొండ మండల పరిధిలోని విఠన రాజు పల్లి గ్రామంలో గల సెయింట్ ఆన్స్ ఉషోదయ ప్రత్యేక పాఠశాలకు చెందిన విద్యార్థులకు నిత్యవసర సరుకులు, బియ్యం, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన పల్నాడు జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి మారుతి వరప్రసాద్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము వినుకొండ నియోజకవర్గం కార్యదర్శి బుదాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొనీ విద్యార్థ్ని, విద్యార్థులకు పంపిణీ చేశారు తొలుత విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రారంభించిన విశాలాంధ్ర దినపత్రిక నేటికీ 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలియజేశారు నేడు పెట్టుబడిదారీ వర్గాలకు పత్రికారంగం దాసోహమై విలువలు దిగజారిస్తున్న తరుణంలో విశాలాంధ్ర దినపత్రిక సామాజిక విలువల కోసం ప్రజా ప్రయోజనాల కోసం సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ఉండడం గొప్ప విషయం అన్నారు .విశాలాంధ్రలో పాత్రికేయులు నిష్పక్షపాతంగా వార్తల అందిస్తూ ప్రజల పక్షం వహించడం అభినందన మన్నారు. పత్రికను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ బొల్లాపల్లి మండల కార్యదర్శి పిన్ని బోయిన వెంకటేశ్వర్లు వినుకొండ మండల కార్యదర్శి భూదాల సాగర్ బాబు నూజెండ్ల మండల కార్యదర్శి ఏ పవన్ కుమార్,పట్టనసహయకర్యదర్సి కొంద్రముట్లసుభాని, సీనియర్ నాయకులు పటాన్ లాల్ ఖాన్, షేక్ కిషోర్,ఆర్.వందనం,మల్లికార్జునరావు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img