Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

జేసీ ఆకస్మిక తనిఖీ

విశాలాంధ్ర`తాడికొండ: నియోజకవర్గ కేంద్రమైన తాడికొండ లోని 1, 3 గ్రామ సచివాలయాలను గురువారం జెసి శ్రీధర్‌ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయాలలో పనిచేస్తున్న సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే హాజరు పట్టి, బయోమెట్రిక్‌, జగనన్న కాలనీలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరు తదితర విషయాలను సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నారు. జెసి వెంట ఈవోపీఆర్డీ షేక్‌ జాకీర్‌ హుస్సేన్‌, సూపరిండెంట్‌ మహేష్‌ బాబు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img