`హైదరాబాద్ : సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో మన రాష్ట్రం రెండో స్థానంలో, దక్షిణ భారత దేశంలో మొదటి స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో 750 మెగావాట్ల సోలార్ సెల్స్, 750 మెగా వాట్ల సోలార్ మాడ్యూల్స్ సోలార్ ప్రీమియర్ ఎనర్జీస్ పరిశ్రమను మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించే వారికీ టీఎస్ ఐపాస్ కింద వెంటనే మంజూరు చేస్తామని తెలి పారు. 483 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిం చిన సోలార్ ప్రీమియం ఎనర్జీస్ వారికి అభినంద నలు తెలిపారు. కరోనా సమయంలో కూడా రికార్డు స్థాయిలో పరిశ్రమను స్థాపించి పని చేశారన్నారు. ఈ పరిశ్రమలో 700 మందికి ఉపాధి కల్పించామన్నారు. 90శాతం మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వం ముందు ఉన్న అతి పెద్ద సమస్య యువతకు ఉపాధి కల్పన అన్నారు. లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యో గులకు ఉపాధి కల్పించడానికి ప్రైవేటు సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నామని, ఏడు సంవ త్సరాల్లో పదిహేను వేల పైచిలుకు పరిశ్రమలను ఏర్పాటు చేశామని అన్నారు. పోటీ ప్రపంచంలో రెన్యూబుల్ ఎనర్జీ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి పరిశ్రమ లకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ పరిశ్రమలకు అదనంగా పన్నెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తామని అన్నారు. ఆగస్టు 5న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా స్కిల్ డెవలప్మెంట్ సంస్థను స్థాపిస్తామని మంత్రి అన్నారు. ఐటిఐ, డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… పరిశ్రమల ఏర్పా టుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, తెలం గాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను సవాళ్లను ఎదుర్కొని అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్న ఘనత ముఖ్య మంత్రి కేసీఆర్కు దక్కిందన్నారు. మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు ఇస్తామన్నారు. హైదరాబాద్ విశ్వ నగరంగా తీర్చిదిద్దే విధంగా కేటీఆర్ ముందుకు వెళ్తు న్నారని అన్నారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా టీఎస్ఐ పాస్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచిందని మంత్రి అన్నారు. వాక్సిన్ తయారీలో మూడోవంతు హైదరా బాద్ నుంచి వెళుతుందని అన్నారు. మహిళా సాధికారత కోసం వీ హాబ్ ఏర్పాటు చేశామన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక పర్సంటేజీ కల్పించాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఐటీ జయేశ్ రంజన్, టీ.ఎస్.ఐఐసీ ఎం.డి నర్సింహారెడ్డి, కలెక్టర్ ఆమయ్ కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, స్థానిక మున్సిపల్ చైర్మన్ మధు మెహన్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ శాసన సభ్యులు తీగల కృష్ణా రెడ్డి, మాజీ డీజీపీ తేజ్ దీప్ కౌర్, డైరెక్టర్ ఎలక్ట్రా నిక్స్ కారంపూడి విజయ్, ప్రీమియర్ ఎనర్జీస్ సురేం దర్ పాల్ సింగ్, మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవి శాలుజా, సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.