Friday, April 26, 2024
Friday, April 26, 2024

అన్ని వర్గాల అభివృద్ధికి కృషి : మంత్రి

విశాలాంధ్ర`ఘట్‌కేసర్‌ : అన్ని వర్గాల ప్రజల అభ్యునతికి ప్రభుత్వం కృషి చేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధి యంనంపేట్‌ రెండవ వార్డు పరిధిలోని సాయితేజ కాలనీలో సీసీ రోడ్డు, రాజీవ్‌ గృహకల్ప కాలనీ 10వ వార్డు పరిధిలో ఓపెన్‌ జిమ్‌, పార్కును చైర్మెన్‌ బోయపల్లి కొండల్‌ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం అన్నానగర్‌ 13వ వార్డు పరిధిలోని సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాలలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, నేడు దళితుల అభివృద్దికి ముఖ్యమంత్రి కేసిఆర్‌ దళిత బందు పథకం చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మెన్‌ నానావత్‌ రెడ్యా నాయక్‌, కమిషనర్‌ సురేష్‌, కౌన్సిలర్లు గొంగళ్ళ మహేష్‌, నర్రి ధనలక్ష్మీ, చింతల రాజశేఖర్‌, సింగిరెడ్డి సాయిరెడ్డి, బాలగోని వెంకటేష్‌ గౌడ్‌, మెట్టు బాల్‌రెడ్డి, సామల శ్రీలత, ఆకిటి శైలజ, భైర హిమ, సుర్వి సుధాలక్ష్మీ, సుర్వి రవిందర్‌, కో ఆప్షన్‌ సభ్యులు మహ్మద్‌ అక్రమ్‌ ఆలీ, దాసరి శంకర్‌, బాలగోని శకుంతల, టిఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు మందాడి సురేందర్‌ రెడ్డి, కార్యనిర్వాహణ అధ్యక్షుడు గొంగళ్ళ బాలేష్‌, ప్రధాన కార్యదర్శులు నల్లవెల్లి శేఖర్‌, కొమ్ముల ప్రశాంత్‌, మాజీ ఉపసర్పంచ్‌ ఆకిటి బాల్‌రెడ్డి, నాయకులు బద్దం జగన్‌ మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img