Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఎంపీ టికెట్ మల్లురవికే కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి వినతి

విశాలాంధ్ర – ఆమనగల్లు : నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతినిత్యం ప్రజల మధ్య తిరిగే మల్లు రవికి కేటాయించాలని రాష్ట్ర నాయకులు వస్పుల జంగయ్య, గుర్రం కేశవులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దీప దాస్ మున్షిజీని శనివారం వారు కలిసి నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మల్లురవిని ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. నిరంతరము ప్రజల మధ్య తిరిగి టికెట్ కేటాయిస్తే భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలంగాణ ఇన్చార్జికి అందజేసిన వినతి పత్రంలో పోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో నాయకులు రవీందర్ నాయక్, ఖాదర్ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img