Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అంతరిక్ష కేంద్రానికి నలుగురు వ్యోమగాములు

ఫ్లోరిడా: అంతరిక్ష కేంద్రంలో పని చేసేందుకు నలుగురు వ్యోమగాములతో కూడిన బృందం రోదసిలోకి వెళ్లింది. ఫాల్కన్‌ రాకెట్‌ ద్వారా స్పేస్‌ఎక్స్‌ సంస్థ వీరిని నింగిలోకి పంపింది. ఇందులో అమెరికాకు చెందిన ఇద్దరు, యూఏఈ, రష్యాకు చెందిన ఒక్కో వ్యోమగామి ఉన్నారు. రోదసీలోకి వెళ్లిన యూఏఈకి చెందిన రెండో వ్యోమగామిగా సుల్తాన్‌ అల్‌-నెయాది ఖ్యాతి గడిరచారు. నాసా కోసం నలుగురు వ్యో మగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎలాన్‌ మస్క్‌కు చెం దిన స్పేస్‌ ఎక్స్‌ నింగిలోకి పంపింది. ఫాల్కన్‌ రాకెట్‌ వీరిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. అమెరికాలోని కెనెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది. యూఏఈకి చెందిన సుమారు 80మంది ప్రేక్షకులు ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించారు. యూఏఈలోని పాఠశాలలు, కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆరు నెలల పాటు సుల్తాన్‌ అల్‌ నెయాది అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించనున్నారు. సౌదీ యువరాజు సుల్తాన్‌ బిన్‌ సల్మాన్‌ 1985లో డిస్కవరీ షటిల్‌లో ప్రయాణించి అంతరిక్షంలోకి వెళ్లిన అరబ్‌ జాతీయుడిగా కీర్తి గడిరచారు. ఫాల్కన్‌ రాకెట్లో యూఏఈ వ్యోమగామితో పాటు రిటైర్డ్‌ నేవీ సబ్‌మెరౖౖెనర్‌, నాసాకు చెందిన స్టీఫెన్‌ బోవెన్‌, మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో మాజీ రీసెర్చ్‌ సైంటిస్ట్‌ వారెన్‌ వుడీహోబర్గ్‌, రష్యన్‌ వైమానిక దళం నుంచి పదవీ విరమణ చేసిన స్పే స్‌ రూకీ ఆండ్రీ ఫెడ్యావ్‌ ఉన్నారు. వీరంతా అక్టోబర్‌ నుంచి అంతరిక్ష కేంద్రంలో సేవలు అందిస్తున్న అమెరికా, రష్యా జపాన్‌ బృందాన్ని భర్తీ చేయనున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం విషయంలో ఇంకా అమెరికా, రష్యా కలిసే పని చేస్తుండటం విశేషం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img