– మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్
విశాలాంధ్ర-మైలవరం: కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు మరిన్ని నిధులు కేటాయించాలని అదానీ ఆస్తులను జాతీయం చేయాలని మోడీ ప్రభుత్వాన్ని దించే వరకు మరిన్ని పోరాటాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిస్టు సమితి పిలుపుమేరకు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట స్టేట్ బ్యాంకు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన నిరసన సభలో మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర కమ్యూనిస్టు సమితి సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు జల్లి విల్సన్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు
ఎన్నో పోరాటాల ఫలితమే రాజభరణాల రద్దు బ్యాంకులను జాతీయం చేయటం జరిగిందని అలాంటిది మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి విమానాశ్రయాలు పోర్టులు రైల్వేలు అదానికి అప్పచెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడని ఎద్దేవ చేశారు
ఈ సభలోని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి సిహెచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా చేస్తున్నారని భారత రాజ్యాంగంలో చెప్పినట్లు ప్రజలందరికీ జీవించే హక్కు జీవనోపాధి కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అలాంటి మోడీ ప్రభుత్వం మేకప్ లో ఉండి అధాని లాంటి మచ్చని పెట్టుకుని మా ప్రభుత్వం పని తీరు బాగానే ఉందని పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పే ప్రధాని మోడీ ఒక్కడే అని అన్నారు
ఈ నిరసన సభకు మైలవరం మండల సిపిఐ ఇన్చార్జ్ కార్యదర్శి బుద్ధవరపు వెంకట్రావు అధ్యక్షుత వహించగా నియోజవర్గ కార్యదర్శి బుడ్డి రమేష్ వందన సమర్పణ చేశారు
ఈ కార్యక్రమంలో మహిళా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కే రత్నకుమారి బానోతు పెద బాలు కే సీతయ్య జై రాజు శివుడు ఆనంద్ రెడ్డిగూడెం మండల సిపిఐ కార్యదర్శి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.