Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

‘ బాదుడే బాదుడు ’ ప్రతి కార్యకర్త విజయవంతం చేయాలి- బొల్లా రామకృష్ణ

విశాలాంధ్ర-వత్సవాయి : ఈ నెల నాలుగో తేదీన జగ్గయ్యపేటకి నారా చంద్రబాబు నాయుడు ‘ బాదుడే బాదుడు ’ కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా ప్రతి కార్యకర్త సైనికునిలా కదలాలని రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ పిలుపునిచ్చారు. బొల్లా రామకృష్ణ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుండి మండల మరియు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఆపదలో ఉన్న కుటుంబాలకు, చదువుల కొరకు ఆర్థిక సాయం చేస్తూ నియోజకవర్గ ప్రజల మనసుల్లో మంచి పేరును సంపాదించుకున్నారు. నియోజకవర్గం..మండలాల ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొంటూ నమ్మిన వారిని తన వెన్నంటే ఉన్నవారికి రక్షణ కవచంలా మారి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఇప్పించి ఆపదలో ఉన్న వారికి ఆపన హస్తంగా మారారు. నిరుద్యోగ యువతకు పార్టీలు చూడకుండా ఉపాధి కల్పించి వందలాది మంది నిరుద్యోగులకు ఆశావాహిక నిలిచారు. యువకుడు ఉత్సాహవంతుడు మరియు ఆర్థికపరంగా బలోపేతమైన వ్యక్తి కావడంతో నియోజకవర్గంలో పూర్తిస్థాయి బలం పుంజుకున్నారని పలువురు రాజకీయ మేధావులు అంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్ర యువతఅధికార ప్రతినిధి పదవిని కైవసం చేసుకున్నారు. ఈనెల నాలుగో తేదీన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పలువురు రాజకీయ ప్రముఖులు గుసగుసలాడుతున్నారు మరికొందరు ఆ ప్రకటనలో యువకుడు ఉత్సాహవంతుడైన బొల్లా రామకృష్ణ పేరు ఉంటుందని ఆశిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img