విశాలాంధ్ర- గూడూరు : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెడన నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రి జోగి రమేష్ ఆదేశానుసారం గూడూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు మండల అధ్యక్షులు తలుపుల వెంకట కృష్ణారావు పూలమాలవేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ ఎం డైరెక్టర్ గొరిపర్తి వరలక్ష్మీ రవికుమార్, మచిలీపట్నం పార్లమెంట్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిమాగంటి నాగరాజు యాదవ్, గూడూరు గ్రామ సర్పంచ్ లింగం సులోచన రాణి, గూడూరు పార్టీ అధ్యక్షులు పోతన సుధాకర్, తలుపుల ఫణి, పిఎసిసి డైరెక్టర్ ఆకూరు శీను, పావురాల ఆంజనేయులు, కొండేటి శ్రీనివాసరావు, మోరాల ఆంజనేయులు, వేమూరి స్వామి, బీరం రాజా, లింగం విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.