Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎన్నారై టిడిపి శ్రేణుల్లో నూతనోత్సాహం

నేడు కువైట్ నగరంలో మినీ మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు

ముఖ్య అతిథులుగా హాజరైన టిడిపి శ్రేణులు

విశాలాంధ్ర -రాజంపేట: తెలుగు జాతి కీర్తిని దశదిశలా వ్యాపింప చేసిన ధీరుడు..చలనచిత్ర పరిశ్రమలో రారాజు.. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు.. రాజకీయ దరుంధరుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి మహోత్సవాలను, మినీ మహానాడు కార్యక్రమాన్ని కువైట్ నగరంలో కార్మెన్ స్కూల్ ఖైతాన్ వద్ద శుక్రవారం అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుందని ఎన్నారై టిడిపి కువైట్ ప్రధాన కార్యదర్శి మారోతు మల్లికార్జున గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ నుండి పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు,మాజీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వేమూరి రవికుమార్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి, గుడివాడ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టిడిపి కడప నియోజకవర్గ ఇన్చార్జ్ అమీర్ బాబు, బద్వేల్ నియోజకవర్గ యువ నాయకులు రితేష్ కుమార్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గ నాయకులు జయరాం నాయుడు, రాజంపేట టిడిపి పార్లమెంట్ అధికార ప్రతినిధి అద్దేపల్లి ప్రతాపరాజు,ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షులు రావి రాధాకృష్ణ, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి సజ్జ అజయ్,తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి మహేందర్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు నవీన్ కుమార్ రెడ్డి లు విచ్చేయడం జరుగుతుందన్నారు. మినీ మహానాడు కార్యక్రమానికి, ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలకు కువైట్ నగరంలో ఉన్నటువంటి ఎన్నారై టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏపీ నుండి కువైట్ కు విచ్చేసిన రావు వెంకటేశ్వరరావు తో పాటు టిడిపి నాయకులను ఎయిర్ పోర్టు వద్ద మారోతు మల్లికార్జున ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. కార్యక్రమంలో ఓలేటి రెడ్డయ్య చౌదరి,శ్రీనివాసరాజు,పిడికిటి శ్రీనివాస్,కేశినేని మురళి, పరశురాం,చింతల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img