Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

శెట్టూరు : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సాకే గురుమూర్తి, ఉపాధ్యాయుడు అబ్దుల్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని నిత్యం సమస్యల కోసం పోలీస్ స్టేషన్, గ్రామ సచివాలయం పనులు కోసం వచ్చే ప్రజల వేసవి కాలంలో నీటి దాహం తీర్చడం చాలా గొప్ప విషయం అన్నారు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఇంకో మరెన్నో ప్రజా సమస్యలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారు ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కుందుర్పి రామాంజనేయులు తాలూకా కన్వీనర్లు అనుంపల్లి రామన్న,ఎన్ ఆర్ శివ,అనిల్ కుమార్, బాబు, మారుతి, మారెన్న మండల అధ్యక్షులు వెట్టి తిప్పేస్వామి బాబు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img