Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

విలేకరిపై దాడి చేసిన బలరాంను కఠినంగా శిక్షించాలి

విశాలాంధ్ర-పెద్దకడబూరు : కోడుమూరు విలేకరిపై దాడి చేసిన అధికార పార్టీ అనుచరుడు బలరాంను కఠినంగా శిక్షించాలని శుక్రవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో తాహశీల్దార్ కార్యాలయం ఎదుట పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే తాలూకా ఉపాధ్యక్షులు పుల్లయ్య, సహాయ కార్యదర్శి ఈరన్న, మండల కార్యదర్శి రామన్న మాట్లాడుతూ కోడుమూరులో ఇసుక దందాపై వార్త రాసిన విశాలాంధ్ర విలేఖరి సతీష్ పై అధికార పార్టీ నాయకుడు ఎమ్మెల్యే సుధాకర్ అనుచరుడు బలరాం దాడి చేసి గాయపరచడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జర్నలిస్టుపై దాడి చేసిన బలరాంను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు మల్లికార్జున, నారాయణ, శివ, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img