Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

దేశంలో మతోన్మాదాన్ని తరిమికొట్టాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : దేశంలో మతోన్మాదాన్ని తరిమికొట్టాలని ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, మండల అధ్యక్షులు మహ్మద్ హుస్సేన్, కార్యదర్శి దస్తగిరి అన్నారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టి దేశం కోసం ప్రాణాలు వదలి వీరులుగా నిలిచిపోయారని కొనియాడారు. బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశ యువతను పక్కదోవ పట్టిస్తుందని విమర్శించారు. దేశాన్ని హిందుత్వం పేరుతో బిజెపి, ఆర్ ఎస్ ఎస్ లు సర్వ నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. మరో మారు బిజెపి అధికారంలోకి వస్తే దేశానికి పెను ముప్పు ఏర్పడుతుందన్నారు. కావున రాబోయే ఎన్నికల్లో సరైన వారిని ఎన్నుకోవాలన్నారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల బాటలో నడచి, సమాజం మార్పు కోసం కృషి చేసి అందరూ లౌకిక వాదమంలో నడవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీరాములు, నాగేష్, అంజి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img