Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

విద్యుత్‌ శాఖ ఇంచార్జి ఏఈగా మల్లికార్జున

విశాలాంధ్ర`ఆస్పరి : మండల విద్యుత్‌ శాఖ ఇన్చార్జి ఏఈగా మల్లికార్జున శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఏఈ బాబా ఆజాద్‌ బదిలీలపై వెళ్లడంతో వారి స్థానంలో ఆదోని డీ3 సెక్షన్‌ ఇంజనీర్‌ గా పనిచేస్తున్న మల్లికార్జున ఆస్పరి విద్యుత్‌ శాఖ ఇన్చార్జి ఏఈగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు లైన్‌ మెన్‌ లు, విద్యుత్‌ సిబ్బంది మల్లికార్జున కు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఏఈ విలేకరులతో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రైతులకు వ్యవసాయపరంగా అన్నివేళలా విద్యుత్‌ సరఫరా చేస్తామని దీనికి రైతులందరూ సహకరించాలని, ప్రజలు సకాలంలో విద్యుత్‌ బిల్లులు చెల్లించి విద్యుత్‌ శాఖకు సహకరించాలని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనకు విన్నవించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img