రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్
కాంగ్రెస్కు పునర్జన్మ ఇవ్వాల్సిన అవసరం ఉందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. దాని ఆత్మ, ఆలోచనలు, భావజాలం అలానే ఉంటాయి కానీ, మిగతావన్నీ కొత్తగా ఉండాలని అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ 2024లో మాత్రం బీజేపీని ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, అందుకు చేయాల్సిందల్లా ఏకతాటిపైకి రావడమేనని అన్నారు. కాంగ్రెస్ ఆ పనిని ఇప్పుడే ప్రారంభిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని సవాలు చేయగలిగే స్థాయికి ఎదుగుతుందని అన్నారు. బీజేపీ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ బీహార్, బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి తూర్పు, దక్షిణ భారతదేశంలోని దాదాపు 200 స్థానాల్లో 50 కంటే ఎక్కువ సీట్లను సాధించేందుకు ఇప్పటికీ పోరాడుతోందని అన్నారు.గాంధీ కుటుంబం కాంగ్రెస్ను విడిచిపెట్టినా ఆ పార్టీ పుంజుకునే అవకాశం లేదని, కాబట్టి కాంగ్రెస్ డ్రాయింగ్ బోర్డుకు తిరిగి వెళ్లి ప్రాథమికాలను సరిచేయాల్సిన సమయం ఇదేనని అన్నారు. బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు షార్ట్కట్స్ ఏమీ లేదని, 10-15 ఏళ్ల దృక్కోణంతో ముందుకు వెళ్లడమే ఏకైక మార్గమని అన్నారు.