ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది తొలిసారిగా మే 2 నుంచి 5 వరకు మూడు రోజులపాటు ప్రధాని మోదీ పలు దేశాల్లో పర్యటించనున్నారు. జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో ఆయన పర్యటించనున్నారు.తొలుత ఆయన జర్మనీకి వెళ్లనున్నారు. బెర్లిన్ లో జర్మనీ చాన్సెల్లర్ ఒలాఫ్ షోల్స్ తో ఆయన సమావేశమై, ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు కలిసి ఇండియా – జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్ 6వ ఎడిషన్ లో పాల్గొంటారు. ఈ సమావేశంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం గురించి మూడు దేశాల నేతలతో చర్చిస్తారు. అనంతరం జర్మనీ నుంచి డెన్మార్క్ వెళ్తారు. ఆ తర్వాత మే 4వ తేదీన ప్యారిస్ చేరుకుంటారు. ఈ వివరాలను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది.