Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఉక్రెయిన్‌ నుంచి దిల్లీకి చేరుకున్న సీ-17 విమానాలు..స్వదేశానికి మరో 420 మంది విద్యార్థులు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్‌ గంగలో భాగంగా మరో రెండు విమానాలు న్యూదిల్లీ చేరుకున్నాయి. 420 మందితో హంగరీలోని బుడాపెస్ట్‌, రొమేనియాలోని బుకారెస్ట్‌ నుంచి వైమానిక దళానికి చెందిన రెండు సీ-17 విమానాలు దిల్లీ సమీపంలోని హిండన్‌ ఎయిర్‌బేస్‌లో దిగాయి. స్వదేశానికి తిరిగివచ్చిన విద్యార్థులకు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్‌ భట్‌ స్వాగతం పలికారు. ఆపరేషన్‌ గంగలో భాగంగా ఇప్పటివరకు 6400 మంది భారతీయులు ఉక్రెయిన్‌ నుంచి తిరిగివచ్చారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. మరో రెండు మూడు రోజుల్లో 7400 మంది భారతీయులు స్వదేశానికి చేరుకుంటారని తెలిపింది. భారతీయుల తరలింపునకు 30 విమాన సర్వీసులు నడుపుతున్నామని చెప్పారు. ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాల నుంచి తరలిస్తున్నామని వెల్లడిరచారు. రానున్న 24 గంటల్లో 18 విమానాలు భారత్‌కు చేరుతాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img