అగ్నిపథ్ పథకం ద్వారా రిక్రూట్ అయిన అగ్నివీర్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేర్చుకోనున్నట్టు ఐఏఎఫ్ చీఫ్మార్షల్ వివేక్ రామ్ చౌదరి చెప్పారు. వారి తొలి శిక్షణ కోసం ఈ ఏడాది డిసెంబర్లో 3000 మంది అగ్నివీరులను తీసుకుంటున్నామని శనివారం తెలిపారు. భారత వైమానిక దళం 90వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడిరచారు. ప్రతి అగ్నివీరుడు ఐఏఎఫ్లో వృత్తిని ప్రారంభించడానికి సరైన నైపుణ్యాలు, టెక్నాలజీ కలిగి ఉండేలా వైమానిక దళం వారి కార్యాచరణ శిక్షణా పద్ధతిని మారుస్తుందని ఎయిర్ చీఫ్ వీఆర్చౌదరి తెలిపారు. రానున్న కాలంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.