Friday, April 26, 2024
Friday, April 26, 2024

డిసెంబర్‌లో 3వేల మంది అగ్నివీర్‌ల చేరిక..

అగ్నిపథ్‌ పథకం ద్వారా రిక్రూట్‌ అయిన అగ్నివీర్‌లను ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో చేర్చుకోనున్నట్టు ఐఏఎఫ్‌ చీఫ్‌మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి చెప్పారు. వారి తొలి శిక్షణ కోసం ఈ ఏడాది డిసెంబర్‌లో 3000 మంది అగ్నివీరులను తీసుకుంటున్నామని శనివారం తెలిపారు. భారత వైమానిక దళం 90వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడిరచారు. ప్రతి అగ్నివీరుడు ఐఏఎఫ్‌లో వృత్తిని ప్రారంభించడానికి సరైన నైపుణ్యాలు, టెక్నాలజీ కలిగి ఉండేలా వైమానిక దళం వారి కార్యాచరణ శిక్షణా పద్ధతిని మారుస్తుందని ఎయిర్‌ చీఫ్‌ వీఆర్‌చౌదరి తెలిపారు. రానున్న కాలంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img