Friday, April 26, 2024
Friday, April 26, 2024

దోస్తుల కోసమే ఆస్తుల అమ్మకాలు : ఖర్గే

న్యూదిల్లీ : నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్ల నిధుల సమీకరణ కోసం జాతీయ సంపదను అమ్మేస్తున్నదని రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దీని ద్వారా సామాన్యులకు, దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికే రూ.3.50 లక్షల కోట్ల ఆస్తులు అమ్మేసిందని ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. వ్యాపారం వృద్ధి చెందితే దేశ సంపద పెరుగుతుందని, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం ద్వారా మిశ్రమ ఆర్థిక వృద్ధి జరుగుతుందని నెహ్రూ భావించినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 35 లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. ప్రభుత్వరంగం, బ్యాంకింగ్‌, రైల్వే, బీమా రంగాల సంస్థలను మోదీ సర్కారు నిర్ధాక్షిణ్యంగా విక్రయిస్తోందని ఖర్గే మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం ద్వారా రిజర్వేషన్లు పూర్తిగా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని పరోక్షంగా రిజర్వేషన్లు ఎత్తేసే పనిలో పడ్డారని విమర్శించారు. 1991లో పీవీ నరసింహారావు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించినా ప్రభుత్వ రంగాన్ని ఇబ్బంది పెట్టలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజా సంపదను కాపాడితే బీజేపీ నేతలు అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగాన్ని లూటీ చేయడం.. దోస్తులకు పంచి పెట్టడమే మోదీ పనిగా పెట్టుకున్నారని ఖర్గే విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img