చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జె.జయలలిత సహచరురాలు వి.కె.శశికళ సోమవారం సాయంత్రం నటుడు రజనీకాంత్ను చెన్నైలోని పోయెస్ గార్డెన్లోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. రజనీకాంత్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంతో ఆయనను అభినందించిన శశికళ ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సూపర్స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది అక్టోబర్లో కరోటిడ్ రివాస్కులరైజేషన్ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. కాగా శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు కారాగారంలో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి ఈ ఏడాది జనవరిలో విడుదలయ్యారు. జయ మరణం తర్వాత 2018 సెప్టెంబర్లో అన్నాడీఎంకే నుంచి శశికళను అధికారికంగా తొలగించారు.