లఖింపూర్లో జరిగిన రైతుల హత్య కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. 8 వారాల పాటు బెయిల్ను ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. 2021లో లఖింపూర్లో ధర్నా చేపడుతున్న రైతుల మీదకు ఆశిష మిశ్రా కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించారు. మర్డర్ కేసు నమోదు చేసి ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.