Friday, April 26, 2024
Friday, April 26, 2024

లీటర్‌ నూనెపై రూ.10 తగ్గించాలి.. కంపెనీలకు సూచించిన కేంద్రం

ఆరు నెలలుగా నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వంట నూనెల ధరలకైతే కళ్లెం పడటం లేదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. వంట నూనెలు తయారు చేసే సంస్థలు వెంటనే ధరలు తగ్గించాలని సూచించింది. లీటర్‌ నూనెపై
రూ.10 తగ్గించాలని కంపెనీలకు తెలిపింది. వారం రోజుల్లో ఈ మేర తగ్గించాలని స్పష్టం చేసింది. ఫుడ్‌ సెక్రటరీ సుధాంషు పాండే ఇదే విషయాన్ని వెల్లడిరచారు. ధరలు తగ్గించటంతో పాటు సంస్థలన్నీ దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులపై ఒకే ధర ఉండేలా చర్యలు చేపట్టాలనీ అడిగింది. నిజానికి అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు ఇటీవలే తగ్గాయి. ఈ నేపథ్యంలోనే ఆహార మంత్రిత్వ శాఖ వంట నూనెల తయారీ సంస్థలతో సమావేశమైంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గినందున దేశీయంగా రిటైల్‌ ధరలు తగ్గించాలని చెప్పింది.
వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం: తయారీ సంస్థలు
కేంద్రం ఆదేశాల మేరకు పలు సంస్థలు పామ్‌ ఆయిల్‌, సోయా బీన్‌ ఆయిల్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటర్‌ ధరల్ని రూ.10 మేర తగ్గించేందుకు సుముఖత చూపించాయి. వారం రోజుల్లో ఈ నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. ముందు ఈ నూనెల ధరలు తగ్గితే మిగతా వంట నూనెల ధరలూ తగ్గే అవకాశముందని అంటోంది కేంద్రం. ఇక్కడే మరో కీలక విషయాన్నీ ప్రస్తావించింది. దేశంలోనే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ధరలు ఉండటంపై చర్చించింది. కనీసం రూ.3-5 వరకు ధరల్లో తేడా ఉంటోందని, ఇలా కాకుండా అంతటా ఒకటే ధర ఉండేలా చూడాలని చెప్పింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img