Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

కోడికత్తి కేసు… సీఎం జగన్‌ విచారణకు హాజరుకావాలంటూ ఎన్‌ఐఏకు కోర్టు ఆదేశాలు

కోడి కత్తి కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ పై శ్రీనివాస్‌ అనే యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. ఈ కేసు విచారణ విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో కొనసాగుతోంది. ఈరోజు విచారణ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణకు జగన్‌ ను కూడా హాజరుపరచాలని ఎన్‌ఐఏను ఆదేశించింది. ఈ కేసులో తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్‌ పోర్ట్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ రాఘవ విచారణకు హాజరు కాకపోవడంతో కేసుకు సంబంధించి మొత్తం ట్రయల్‌ షెడ్యూల్‌ ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఇందులో విక్టిమ్‌ (బాధితుడు) షెడ్యూల్‌ కూడా ఉండాలని తెలిపింది. ఈ కేసులో బాధితుడు జగన్‌ కావడంతో… ఆయన కూడా కోర్టుకు వచ్చేలా షెడ్యూల్‌ ను రూపొందించాలని ఎన్‌ఐఏను జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసిన కోర్టు… ఆరోజు విచారణకు జగన్‌ రావాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img