Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పెట్రోల్‌, ఎల్పీజీ ధరల పెంపుపై రాజ్యసభలో విపక్షాల ఆందోళన

పెట్రోల్‌, ఎల్పీజీ ధరల పెంపుదలను నిరసిస్తూ రాజ్యసభలో ఇవాళ విపక్షలు ఆందోళన చేపట్టాయి. విపక్ష ఎంపీలు ప్లకార్డులు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. .దీంతో చైర్మెన్‌ వెంకయ్యనాయుడు సభను తొలుత 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత రెండవసారి కూడా వెల్‌లోకి దూసుకువచ్చిన విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో డిప్యూటీ చైర్మెన్‌ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. పెట్రోల్‌పై ఇవాళ 90 పైసలు, గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50 పెంచిన విషయం తెలిసిందే. అంతకుముందు చైనాలో విమాన ప్రమాదంలో మృతిచెందిన వారికి సభ నివాళి అర్పించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img