రాజస్థాన్లో పలుచోట్ల వరుసగా రెండోరోజు భూకంపం సంభవించింది. గురువారం ఉదయం బికానెర్ ప్రాంతంలో మరోమారు భూప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడిరచింది. పెద్ద శబ్దాలతో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.వరుస భూప్రకంపనలతో భయాందోళనకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో భూకంపాలు చాలా ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఇటీవల కాలంలో దిల్లీ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లోనూ భూకంపాలు చోటు చేసుకున్నాయి.