Friday, April 26, 2024
Friday, April 26, 2024

రమేష్ సంఘమిత్ర లో కోమలి ఫెర్టి లిటి సెంటర్ ప్రారంభం

విశాలాంధ్ర – ఒంగోలు : స్థానిక రమేష్ సంఘమిత్ర హాస్పిటల్l లో నూతనంగా ఏర్పాటు చేసిన కోమలి ఫర్టి లి టి సెంటర్ ను జిల్లా ఎస్ పి మల్లిక గార్గ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ పి మాట్లాడుతూ భార్య భర్తల జీవితంలో పిల్లలకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు.భార్య భర్తల సంతానలేమి ని దూరం చేసేందుకు కోమలి ఫర్ట్ లి టి సెంటర్ ఉపయోగపడాలని అన్నారు.జిల్లా డి ఎం హెచ్ ఒ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో అత్యంత సాంకేతికత తో కూడిన ఐ వి ఎఫ్ లాబ్ సంఘమిత్ర లో ఉన్నదని,దీనివల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా అన్ని సేవలు పొందవచ్చు అన్నారు. హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దీప,డాక్టర్ ప్రతిమ మాట్లాడుతూ గత సంవత్సరం నుండి ఉన్న కల సాకరమయ్యేందన్నారు. ఫె ర్టి లి టి సెంటర్ నందు పలిక్యూటర్ స్టడీ,3 డి అల్ట్రా సౌండ్ , ఇంట్రా యూటిరైన్ ఇన్సిమినేటిన్, ప్రి ఇంప్లా టేషన్ జెనిటిక్ టెస్టింగ్ లతో పాటు స్త్రీ పురుషుల లో సంతానోత్పత్తికి సంభందించి సమస్యలు చూడబడున్నారు.హాస్పిటల్ సి ఒ ఓ డాక్టర్ హరికుమర్ రెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పిల్లల సమస్య ఉన్న దంపతులకు ఈ సెంటర్ వరం లాంటిద న్నారు జిల్లా ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మార్కెటింగ్ హెడ్ డాక్టర్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img