Friday, April 26, 2024
Friday, April 26, 2024

సాగుచేసుకుంటున్న భూములకు భద్రత హక్కులు కల్పించండి

విశాలాంధ్ర సంతనూతలపాడు: సంతనూతలపాడు నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల లో సాగు చేసుకుంటున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సర్వహక్కుల భద్రత కల్పించాలని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంకె సుబ్బారావు కోరారు చీమకుర్తి బూచేపల్లి కళ్యాణ మండపం నందు శుక్రవారం జరుగుతున్న ఎస్సీ ఎస్టీ ప్రత్యేక స్పందన కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గంలో గత 30 ఏళ్లుగా అనేకమంది ఎస్సీ ఎస్ టి కుటుంబాలవారు ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకో ని జీవనోపాధి పొందుతున్నారని అన్నారు కొందరు అగ్ర కులస్తులు ఆ భూములను లాక్కొని దాడులు చేసి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు ఆ భూములను కన్వర్షన్ చేసి ప్రభుత్వ రెవెన్యూ రికార్డులు నమోదు చేసి భూమిపై సర్వహక్కులు కలిగి ఉండే విధముగా చూడాలని లేదా డీకే పట్టాలు మంజూరు చేసి భద్రత కల్పించాలన్నారు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img