Friday, April 26, 2024
Friday, April 26, 2024

సత్తా చాటిన సింధు.. క్వార్టర్స్‌కు పూజా


టోక్యో : ఒలింపిక్స్‌లో ఆరోరోజు బుధవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. షటిల్‌ బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు మరో అడుగు ముందుకేసి ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించగా బాక్సింగ్‌ 75కేజీల విభాగంలో పుజా రాణి క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించి పతకంపై ఆశలు రేపింది. ఇక మహిళల హాకీ జట్టు గ్రేట్‌ బ్రిటన్‌ చేతిలో పరాజయం పాలవగా, ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌ కథ ముగిసింది.
ప్రీక్వార్టర్స్‌లో సింధు..భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగుతేజం పీవీ సింధు.. ప్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. షటిల్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో హంగ్‌కాంగ్‌ ప్రత్యర్థి చెయింగ్‌పై 21-9, 21-16 స్కోరుతో సునాయాస విజయం అందుకుంది. కేవలం 35 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు తన ప్రత్యర్థిని ఏదశలోనూ కోలుకోనీయలేదు. సింధు తన తదుపరి మ్యాచ్‌లో డెన్మార్క్‌ క్రీడాకారిణి మియా బ్లిచ్‌ఫెల్డ్ట్‌తో తలపడనుంది.
నాకౌట్‌ మ్యాచ్‌ అంత సులభం కాదు : సింధు
ప్రీక్వార్టర్స్‌ ప్రత్యర్థి బ్లిచ్‌ఫెల్ట్‌తో మ్యాచ్‌ అంత సులువు కాదని భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అభిప్రాయపడిరది. రెండో రౌండ్‌ లో గెలుపొందిన అనంతరం నాకౌట్‌ మ్యాచ్‌పై స్పందిస్తూ.. దూకుడుగా ఆడితేనే ఆమెతో పోరులో పైచేయి సాధించవచ్చని స్పష్టం చేసింది. రెండో రౌండ్‌ మ్యాచులో తన లయ అందుకున్నానని వెల్లడిరచింది. ఇప్పటివరకు వీరిద్దరూ తలపడ్డ మ్యాచ్‌ల్లో బ్లిచ్‌ఫెల్ట్‌పై సింధుకు 4-1 ఆధిక్యం ఉంది. ఈ మ్యాచ్‌లో సింధు గెలిస్తే.. క్వార్టర్స్‌లో అకానె యమగూచి, సెమీస్‌లో తైజు ఇంగ్‌తో తలపడాల్సి రావొచ్చు.
బాక్సింగ్‌లో చిగురించిన ఆశలు
మహిళల 75కేజీల విభాగంలో భారత బాక్సర్‌ పూజారాణి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. అల్జీరియాకు చెందిన ఇచ్రక్‌చైబ్‌పై 5-0తో గెలుపొంది నాకౌట్‌ దశకు అర్హత సాధించింది.
రోయింగ్‌లో ఆకట్టుకున్నారు..
ఒలింపిక్స్‌లో తొలిసారి ఆడుతున్న అర్జున్‌ లాల్‌ జాట్‌, అరవింద్‌ సింగ్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. రోయింగ్‌ సెమీ ఫైనల్‌2లో ఆరో స్థానంలో నిలిచారు కానీ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. కాగా వారి ఆటతీరును అందరూ ప్రశంసిస్తున్నారు. పురుషుల స్కిఫ్‌ (సెయిలింగ్‌)లో కేసీ గణపతి, వరుణ్‌ టక్కర్‌ జోడీ మూడు రేసుల్లో 18, 17, 19 స్థానాల్లో నిలిచింది. మొత్తంగా 18వ స్థానానికి పరిమితమయ్యారు. రాణించిన దీపికా కుమారి ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో తరుణ్‌దీప్‌రాయ్‌ తొలి రౌండ్‌లో విజయం సాధించాడు. ఉక్రెయిన్‌ ఆటగాడు ఓలెక్సీ హన్‌బిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-4తో గెలుపొందాడు. అప్పటివరకు బాగానే ఆడిన తరుణ్‌దీప్‌ తదుపరి రౌండ్‌లో ఇటలీకి చెందిన షన్నీ ఇటే చేతిలో 6-5తో ఓటమి చవిచూశాడు. మరో ఆటగాడు ప్రవీణ్‌ జాదవ్‌ కూడా తొలి మ్యాచ్‌లో గెలిచి.. తదుపరి రౌండ్‌లో పరాజయం పాలయ్యాడు. దీంతో ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో ఈ ఇద్దరి కథ ముగిసింది. మహిళల వ్యక్తిగత విభాగంలో ఆర్చర్‌ దీపికా కుమారి రాణించింది. తొలుత భూటాన్‌ అథ్లెట్‌ కర్మాపై 6-0తో, తర్వాతి పోటీలో అమెరికా క్రీడాకారిణి ఫెర్నాండెజ్‌పై 6-4తో గెలుపొందింది. ఎలిమినేషన్‌ రౌండ్‌ ఆఫ్‌-8కు అర్హత సాధించింది. మహిళల హాకీలో పరాభవం.. డిఫెండిరగ్‌ ఛాంపియన్‌ గ్రేట్‌ బ్రిటన్‌ తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు 14 గోల్స్‌ తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో రాణీ రాంపాల్‌ సేన టోర్నీలో వరుసగా మూడో ఓటమిని నమోదు చేసింది. బ్రిటన్‌ జట్టులో హన్నా మార్టిన్‌, లిలీ ఓస్లీ , గ్రేస్‌ బాల్స్డాన్‌, గోల్స్‌ సాధించారు. భారత్‌ తరఫున షర్మిలా దేవి (23వ నిమిషం) మాత్రమే ఒక్క గోల్‌ సాధించింది. నాకౌట్‌ స్టేజీకి అర్హత సాధించాలంటే భారత జట్టు వచ్చే రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 1-5తో ఓడిన భారత్‌, జర్మనీతో మ్యాచ్‌లో 0-2తో పరాజయం చవిచూసింది. తదుపరి మ్యాచ్‌ శుక్రవారం ఐర్లాండ్‌తో జరగనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img