రూ. 25లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం : సీఎం జగన్ ప్రకటన
అమరావతి : ఒలింపిక్స్లో విశేష ప్రతిభ చూపిన ఏపీకి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ.రజనీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ.25లక్షల నగదు ఇవ్వడమే కాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం రజనీ తన తల్లిదండ్రులతో పాటు సీఎంను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెను శాలువాతో సత్కరించారు. జ్ఞాపికను బహూకరించారు. గత ప్రభుత్వంలో రజనీకి ప్రకటించి, పెండిరగ్లో ఉంచిన బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. తిరుపతిలో 1000 గజాల నివాస స్థలం, నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్సెంటివ్లు కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రజనీ స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలింపిక్స్ హకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్తో పాటు టోక్యో ఒలింపిక్స్ 2020లో కూడా పాల్గొన్న క్రీడాకారిణి ఆమె. 110 అంతర్జాతీయ హకీ మ్యాచ్లలో పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపింక్స్లో కాంస్య పతక పోరువరకూ భారత మహిళల జట్టు దూసుకెళ్లడంలో, జట్టు విజయాల్లో రజనీ కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ, శాప్ వీసీ అండ్ ఎండీ ఎన్.ప్రభాకర్ రెడ్డి, శాప్ అధికారులు రామకృష్ణ, జూన్ గ్యాలట్, రాజశేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.