Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సీతారాముల ఉత్సవ మూర్తులకు శ్వేత స్టీల్ సెంటర్ వారిచే ఈ కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కళ్యాణోత్సవ వేడుకలకు ఉభయ దాతలుగా వసంత లక్ష్మి అండ్ కలవల బదరీ నారాయణ గుప్తా వ్యవహరించడం జరిగింది. పురోహితులు నారాయణమూర్తి, చంద్రశేఖర్ శర్మ, విశ్వనాథ్, సాయి భరద్వాజులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ కళ్యాణోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలను చూడడానికి వందల సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘము, దేవాలయ కమిటీ, యువజన సంఘం, వాసవి మహిళా మండలి, తదితర అనుబంధ సంస్థల వారు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img