Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ప్రజలందరికీ వైద్యం అందించుటలో వైద్యుల కృషి ఎంతో ఉంది..

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రజలందరికీ వైద్యమును అందించుటలో వైద్యుల కృషి ఎంతో ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రేగాటిపల్లి గ్రామంలో జరుగుతున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వారు ఆకస్వీకంగా తనిఖీ చేశారు. ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎలా జరుగుతుంది? ప్రజలకు అందాల్సిన వైద్య సేవలు అందుతున్నాయా? లేదా? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి అధికారులతో సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం తప్పనిసరిగా సేవా బాధ్యతతో విధులను నిర్వర్తించారని తెలిపారు. ప్రజల ద్వారా ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవని కూడా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ పుష్పలత, నాగరాజు, చిన్న పిల్లల వైద్య నిపుణులు వెంకటేశ్వర్లు, ఈఎన్టి స్పెషలిస్ట్ డాక్టర్ నివేదిత. ఆప్తాలని ఆఫీసర్ ఉరుకుందప్ప, కుమార్ రెడ్డి తోపాటు సూపర్వైజర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img