Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మండలంలోనే తిష్ఠవేసిన ఉన్న ఏనుగులు

విశాలాంధ్ర, సీతానగరం: ఏనుగుల గుంపు సీతానగరం మండలములో అనంతరాయుడుపేట గ్రామానికి దగ్గరలో చెరువువద్ద, చెరకుతోటలో గురువారం ఉదయం నుంచి తిష్టవేసిఉన్నాయి. నాలుగో రోజు కూడా ఉండటంతో పంటలకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రజలు, సందర్శకులు ఏనుగులు వద్దకు రావద్దని అటవీశాఖ,పోలీస్ సిబ్బంది విజ్ఞప్తి చేస్తూ కాస్తున్నారు. ఇదిలా ఉండగా ఏనుగుల దాడిలో గాయాలు పాలయిన పనుకుపేట గ్రామానికి చెందిన బొంగు సింహాచలం, పోలినాయుడులను రైతు సంఘం నేతలు పరామర్శ చేశారు. సత్వరమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వీటిని తరలించే ఏర్పాట్లు చేయాలని నాయకులు రెడ్డి లక్షుము నాయుడు, ఈశ్వరరావు, వెంకట రమణ తదితరులు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img