Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

స్పందన ఫిర్యాదులపై తక్షణమేచర్యలు తీసుకోండి

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు

విశాలాంధ్ర,పార్వతీపురం:పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారంనాడు జిల్లాఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు “స్పందన” కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి ప్రజల నుండి 11ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులోమాట్లాడి, వారి సమస్యల పరిష్కారానికి చట్టపరిధిలో తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. ఫిర్యాదుదారులకు తక్షణమే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ ఓ.దిలీప్ కిరణ్, ఎస్బి సిఐ శ్రీనివాసరావు,ఆర్ఐ శ్రీరాములు, ఎస్ఐ దినకర్ మరియు ఇతర పోలిసు అధికారులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img