Friday, April 26, 2024
Friday, April 26, 2024

డ్రోన్లతో కాశాపేట గ్రామంలోరీసర్వే

తహశీల్దార్ షేక్ ఇబ్రహీం

విశాలాంధ్ర, సీతానగరం:మండలములోని కాసాపెట గ్రామంలో శుక్రవారం నాడు డ్రోన్లతో రీసర్వే నిర్వహించారు.జిల్లా కలెక్టరు నిషాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆనంద్, సబ్ కలెక్టర్ భావన ఆదేశాలుమేరకు వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పధకంక్రింద ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వే ముమ్మరంగా జరుగుతున్నదని తహశీల్దార్ షేక్ ఇబ్రహీం తెలిపారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బందికి సూచనలు ఇస్తూ వేగవంతంగా పూర్తిచేయాలని కోరుతున్నట్లు చెప్పారు. పలు గ్రామాల్లో రీసర్వేపనులు జరుగుతున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆయాగ్రామాలలో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామసర్వేయర్లుతో పాటు విఆర్ఏలు ఆయాగ్రామాలలో ఉండి త్వరితగతిన పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆయనతోపాటు మండల రెవెన్యూ పర్యవేక్షకుడు రాజేష్, మండలసర్వేయర్ రాజగోపాల్ , సెక్రటరీ మురళి, విఆర్ఓ నాగమణి నాయకులుపాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img