Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కండ్లుండి చూడలేని ప్రతిపక్షాలు: హరీష్‌రావు

రాష్ట్రంలోని ప్రతిపక్షాల తీర్పుపై ఆర్థికమంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రతిపక్షాలకు కండ్లు, చెవులు ఉన్న లేనట్టేనని మండిపడ్డారు. సిద్దిపేట అర్బన్‌ మండలం ఏన్సాన్‌పల్లి గ్రామంలో రైతు వేదిక,విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్‌ హయాంలో మడి ఎండకుండ రైతులు పంట పండిరచారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరంతో పాటు ఇతర ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.తెలంగాణ బోర్డర్‌లో మహారాష్ట్ర రైతులు జాగలు కొంటున్నారు. బోర్లు వేసి నీళ్లు తరలించుకుంటున్నారు. ఇది కాదా తెలంగాణ అభివృద్ధి అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో మొన్నటి దాకా బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలో ఉంది%ౌౌ% ఇదీ వాళ్ల అభివృద్ధి అని దుయ్యబట్టారు. పంజాబ్‌ మాదిరిగానే తెలంగాణలో వడ్లు కొనేదాకా కేంద్రాన్ని వదలబోమని తేల్చిచెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img