వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. యాదాద్రిజిల్లాలోని మోట కొండూరు మండలం నుండి పాదయాత్రగా ఆత్మకూరు మండలానికి వెళుతున్న క్రమంలో మార్గమధ్యలో తేనెటీగలు దాడి చేశాయి. దుర్గసానినపల్లి గ్రామం వద్ద చెట్టుకింద గ్రామస్తులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పలువురు కార్యకర్తలపై తేనెటీగలు దాడిచేశాయి. కాగా… తేనెటీగల దాడి నుంచి షర్మిల బయటపడ్డారు.