Friday, April 26, 2024
Friday, April 26, 2024

కర్ణాటక ఫలితాలు తెలంగాణలో పునరావృతం.. రేవంత్ రెడ్డి

కర్ణాటక ఫలితాలు తెలంగాణలో పునరావృతమవుతాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూౌ హిమాచల్ ప్రదేశ్ లో తొలి విజయం, కర్ణాటకలో రెండో విజయం, తెలంగాణలో మూడో విజయం రాబోతోందని రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటక ప్రజల తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. బీజేపీని కర్ణాటక ప్రజలు తిరస్కరించారన్నారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్న కుమారస్వామిని ప్రజలు తిరస్కరించారన్నారు. కర్ణాటక ఫలితం తెలంగాణ కాంగ్రెస్ కు కలిసి వస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img